తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
NDL:నంద్యాల జిల్లా ప్రజలు తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజకుమారి మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మూడు రోజులపాటు నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. తుఫాను పట్ల అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలి.