VIDEO: పుంగనూరులో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
CTR: పుంగనూరులోని ముడేయప్ప సర్కిల్ వద్ద శనివారం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్రాంత DSP సుకుమార్ బాబు, CI సుబ్బారాయుడు, సింగల్ విండో ఛైర్మన్ పగడాల రమణతో పాటు పలువురు పాల్గొన్నారు. SI రమణ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాములు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.