గ్రంథాలయంలో ఘనంగా పొట్టిశ్రీరాములు జయంతి

గ్రంథాలయంలో ఘనంగా పొట్టిశ్రీరాములు జయంతి

KDP: అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా కడప జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన 58 రోజుల నిరాహార దీక్ష, ప్రాణత్యాగం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని డిప్యూటీ లైబ్రేరియన్ పవన్ కుమార్ కొనియాడారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ రాజ్ కుమార్, సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.