అహ్మదాబాద్ చేరుకున్న టీమిండియా
T20 WC ఫైనల్ పోరు కోసం టీమిండియా అహ్మదాబాద్ చేరుకుంది. మార్చి 8న అహ్మదాబాద్లోని మోదీ స్టేడియంలో జరగనున్న తుది పోరులో భారత్, న్యూజిలాండ్తో తలపడనుంది. సాయంత్రం విమానాశ్రయానికి చేరుకున్న ఆటగాళ్లు, అక్కడి నుంచి నేరుగా హోటల్కు వెళ్లారు. ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టగా, భారత జట్టు రేపటి నుంచి ప్రాక్టీస్ చేయనుంది.