తెలంగాణ భవన్లో బాబు జగ్జీవన్ రామ్కు నివాళులు
HYD: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాలు, కార్మికుల సంక్షేమానికి బాబూజీ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.