యూరియా కోసం రైతుల ఆందోళన
NZB: రుద్రూర్ మండల కేంద్రంలోని సింగల్ విండో గోదాం వద్ద రైతులు యూరియా కోసం గురువారం ఆందోళన చేశారు. ఎకరానికి ఒక బస్తా మాత్రమే ఇస్తుండటం వల్ల యూరియాను ప్రైవేట్గా కొనుగోలు చేయడం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగిల్ విండో ఆధ్వర్యంలో రైతులకు అవసరమగు మేరకు సరిపడా యురియా ఇవ్వాలని వారు నినాదాలు చేశారు.