'ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి'

భువనగిరి: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏ.భాస్కర రావు, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి. వీరారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వారు ప్రజల నుండి 34 దరఖాస్తులను స్వీకరించారు.