మగవాళ్లకు పీరియడ్స్ వ్యాఖ్యలపై రష్మిక క్లారిటీ
ఇటీవల ఓ షోలో మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలని, అప్పుడే ఆడవారు పడే బాధ అర్థమవుతుందని నటి రష్మిక మందన్న చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఆ వ్యాఖ్యలపై రష్మిక క్లారిటీ ఇచ్చింది. తాను ఒక ఉద్దేశంతో మాట్లాడితే.. దాన్ని మరోలా అర్థం చేసుకుని నెగటివ్గా వైరల్ చేస్తున్నారని తెలిపింది. అందుకే షోలు, ఇంటర్వ్యూలకు వెళ్లాలంటే తనకు భయమని పేర్కొంది.