'పోలవరం జిల్లాపై ప్రభుత్వం పునరాలోచించాలి'
ELR: జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం గ్రామంలో సోమవారం సచివాలయం వద్ద గిరిజన సంఘాల జేఏసీ రైతు సంఘం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గం లేకపోవడం, షెడ్యూల్డ్ గ్రామాలను కలపకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతూ సచివాలయం సిబ్బందికి వినతి పత్రం అందజేశారు.