జనగణన నిబంధనల్లో కీలక మార్పులు
కేంద్ర ప్రభుత్వం జనగణన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. సహజీవ జంటలకు కుటుంబ హోదా ఇవ్వనుంది. చాలా కాలంగా కలిసి ఉంటున్న వారిని ఇకపై ఒకే కుటుంబంగా గుర్తించాలని నిర్ణయించింది. మొబైల్ యాప్ ద్వారా ఇంటింటికీ వెళ్లి ఇళ్ల వివరాలు సేకరించాలని అధికారులకు సూచించింది. తొలిసారిగా స్వయంగా వివరాల నమోదుకు అవకాశం కల్పించింది. 33 ప్రశ్నలతో ప్రశ్నావళి తయారు చేశారు.