గుంటూరు జీజీహెచ్ నుంచి రిమాండ్ ఖైదీ పరారీ
గుంటూరు జీజీహెచ్ నుంచి రిమాండ్ ఖైదీ పరారీ కావడం కలకలం రేపింది. తెనాలి వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కేసులో అజిత్ కుమార్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. రిమాండ్ కోసం రేపల్లె సబ్ జైలుకు తరలించారు. ఈ క్రమలో అనారోగ్య కారణాలతో మెరుగైన వైద్యం కోసం మూడు రోజుల క్రితం జీజీహెచ్కు పోలీసులు తీసుకువచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ పోలీసుల కళ్లుగప్పి నిందితుడు తప్పించుకున్నాడు.