'ఇందిరా భవన్ కాంగ్రెస్ పార్టీ రెక్కల కష్టం'
BDK: మణుగూరు BRS పార్టీ కార్యాలయం స్వాధీనంపై అశ్వాపురం మండలం కాంగ్రెస్ నాయకులు ఓరుగంటి బిక్షమయ్య ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవగానే బీఆర్ఎస్లోకి చేరి కాంగ్రెస్ భవనాన్ని కబ్జా చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు దక్కిందన్నారు. అన్నం పెట్టిన వాడికి సున్నం పెట్టినట్లు రేగ తీరు అని తెలిపారు.