'అధిక దిగుబడులు కోసం శిక్షణ అందించాలి'
ASR: వ్యవసాయ ఆధారిత జిల్లాను మరింత బలోపేతం చేసేందుకు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ నిషాంతి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, సుగంధ ద్రవ్యాల శాఖల సమన్వయంతో తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయాన్నిచ్చే పంటలను పండించేలా చూడాలన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. దిగుబడులు పెంచేందుకు రైతులకు శిక్షణలను అందించాలన్నారు.