తాడిపత్రిలో డ్రోన్లతో పోలీసుల నిఘా

తాడిపత్రిలో డ్రోన్లతో పోలీసుల నిఘా

ATP: తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ASP రోహిత్ కుమార్ చౌదరి ఆదేశాల మేరకు రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి నేతృత్వంలో వీరాపురం, అర్జాస్ ఫ్యాక్టరీ, పెన్నా నది ప్రాంతాల్లో పర్యవేక్షణ చేపట్టారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.