ఎద్దుపెంట ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్
NDL: డోన్ మండలం ఉంగరానిగుండ్లలోని ఎద్దుపెంట వాటర్షెడ్ ప్రాజెక్టును కలెక్టర్ రాజకుమారి ఇవాళ పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి అధికారులకు సూచనలు చేశారు. ‘జలధార’లో భాగంగా రిడ్జ్ టు వ్యాలీ విధానంపై అవగాహన కల్పించారు. జల సంరక్షణ, సాగునీటి మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.