ఈనెల19 నుంచి వసంత నవరాత్ర మహోత్సవాలు
KKD: పంచారామాల్లో ఒకటైన సామర్లకోట శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 19 నుంచి 27 వరకు శ్రీ వసంత నవరాత్ర మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో బల్ల నీలకంఠ తెలిపారు.19 ఉదయం నవ కలశ స్థాపన, విశేష పూజలు, పంచాంగ శ్రవణం, ఏకాదశి మహా రుద్రాభిషేకం నిర్వహిస్తమన్నారు. 27వరకు విశేషా పూజలు జరుగుతయని భక్తులు స్వామి, అమ్మవారిని దర్శించుకోవాలని ఈవో, ఛైర్మన్ కంటే బాబు అన్నారు.