కొమరోలులో చలివేంద్రం ప్రారంభించిన ఎస్సై
ప్రకాశం: కొమరోలు పట్టణంలోని ఆంజనేయస్వామి గుడి కూడలి వద్ద ఎస్సై నాగరాజు శుక్రవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్సై తెలిపారు. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మట్టికుండల్లో చల్లటి నీటిని అందుబాటులో ఉంచామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.