జిష్ణు దేవ్ వర్మకు వీడ్కోలు పలికిన సీఎస్

జిష్ణు దేవ్ వర్మకు వీడ్కోలు పలికిన సీఎస్

HYD: మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు బదిలీపై వెళ్తున్న జిష్ణు దేవ్ వర్మకి బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, కలెక్టర్ హరిచందన దాసరి తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.