ఈ నెల 5 నుంచి ఐపీఎల్ మ్యాచ్.. భారీ భద్రత
HYD: ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 5 నుంచి మే 22 వరకు ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. మొత్తం 7మ్యాచ్లు జరుగుతాయని అందుకు సంబంధించి భారీ భద్రతను ఏర్పాటు చేశామని మల్కాజ్ గిరి డీసీపీ సురేష్ కుమార్ నిన్న తెలిపారు. సుమారు 2వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టినట్టు చెప్పారు.