కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమం
KMR: కామారెడ్డి కలెక్టరేట్ సమావేశం మందిరంలో ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ విక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలనుండి వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసి రసీదులను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మదన్ మోహన్,ట్రైనీ కలెక్టర్ విజయ్, AO, జిల్లా అధికారులు పాల్గొన్నారు.