'వరల్డ్ టాయిలెట్స్ డే అవగాహన కార్యక్రమం'

AKP: నక్కపల్లి మండలం వేంపాడు సచివాలయం వద్ద వరల్డ్ టాయిలెట్స్ డే సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. ప్రజల్లో పరిశుభ్రత గురించి చైతన్యం కల్పించారు. పరిశుభ్రంగా ఉంచడం వల్ల మరియు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల వ్యాధులు రాకుండా అరికట్టవచ్చని వివరించారు. ఇందులో గ్రామ సర్పంచ్ Y.నూకరత్నం, ఉపసర్పంచ్ ఎ.అప్పలరాజు, గ్రామ పెద్దలు మణిరాజు పాల్గొన్నారు.