VIDEO: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటా రూ.14,600, నాన్ ఏసీ మిర్చి క్వింటా రూ.8,500, అటు క్వింటా పత్తి ధర రూ.7,850 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.75, పత్తి ధర రూ.50 పెరగగా.. అటు నాన్ ఏసీ మిర్చి మాత్రం రూ.100 తగ్గిందని వ్యాపారులు పేర్కొన్నారు.