తిరుమలలో భక్తుల రద్దీ ఇలా

TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న(శనివారం) శ్రీవారిని 84,404 మంది భక్తులు దర్శించుకోగా.. 34,930 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.06 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.