మున్సిపల్ కమిషనర్గా రమ్య కీర్తన నియామకం
PLD: నరసరావుపేట మున్సిపల్ కమిషనర్గా రమ్య కీర్తన నియామకం జరిగింది. ప్రస్తుతం విజయవాడలో గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న ఆమెను బదిలీపై నరసరావుపేటకు తరలిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. పట్టణాభివృద్ధి పనులు మరింత వేగవంతం కావాలని అధికారులు భావిస్తున్నారు.