సైకిల్ రిపేర్ వివాదం.. వ్యక్తిపై దాడి

సైకిల్ రిపేర్ వివాదం.. వ్యక్తిపై దాడి

తూ.గో: రంగంపేట మండలం ఈలకొలనులో సైకిల్ రిపేర్ వివాదంలో దుకాణ యజమాని వెంకటేశ్వరరావుపై దాడి జరిగింది. అంచురి అరుణ్ కుమార్ రూ.500 అడ్వాన్స్ ఇచ్చి రిపేర్ చేయించారు. తరువాత అదనంగా రూ.300 అడగడంతో వాగ్వాదం పెరిగి దాడికి దారితీసింది. కాలికి గాయమైన వెంకటేశ్వరరావు ఆసుపత్రిలో చేరారు. పోలీసులు అరుణ్ కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.