ఈనెల 14న అంబేద్కర్ జయంతి వేడుకలు
PDPL: మాల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 14న అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు రామగుండం నియోజకవర్గ సంఘం అధ్యక్షులు మాలెం మధు తెలిపారు. గోదావరిఖని ప్రెస్క్లబ్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 14న ఉదయం చౌరస్తా నుంచి పట్టణంలోని వివిధ ప్రాంతాల మీదుగా బైక్ ర్యాలీ, అనంతరం కాలి నడకన రామగుండం కార్పొరేషన్ కార్యాలయం వరకు ఐక్యత ర్యాలీ ఉంటుందన్నారు.