చెరువులో పడి అక్కా చెల్లెళ్లు మృతి
CTR: గొర్రెలను కడిగేందుకు చెరువులోకి దిగి అక్కా చెల్లెళ్లు మృతి చెందిన ఘటన గుడిపల్లి (M) యామిగానిపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన భూలక్ష్మి-మునివేంకటప్పకు ఐదుగురు ఆడపిల్లలు. వీరిలో రెండో అమ్మాయి పునీత (17) ఇంటర్ చదువుతుండగా, మూడో అమ్మాయి శ్రావణి (15) 9th చదువుతోంది. ఈ మేరకు నిన్న గొర్రెలను కడిగేందుకు చెరువు వద్దకు వెళ్లగా, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం.