మాడుగుల పల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్
నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలం టోల్ ప్లాజా వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లను నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ రూలర్ సీఐ పీఎన్డీ ప్రసాద్ ఆధ్వర్యంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.