పశు ఔషధ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు

పశు ఔషధ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు

KMM: పశువులకు జనరిక్ మందులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పశు ఔషధ విక్రయ కేంద్రాల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తోందని జిల్లా పశువైద్య అధికారి బి. పురంధర్ తెలిపారు. జిల్లాకు ఒకటి, మండలానికి ఒక కేంద్రం చొప్పున సహకార సంఘాల ద్వారా వీటిని స్థాపించవచ్చు. 120 గజాల స్థలం, ఫార్మసిస్ట్ రిజిస్ట్రేషన్ కలిగిన వారు రూ.5 వేల ఫీజుతో ఆన్ లైన్ల లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.