రైతులు ఎన్పీసీఐ చేయించుకోవాలి: కలెక్టర్

PPM: అన్నదాత సుఖీభవ పథకం పొందుటకు రైతులు బ్యాంకుల వద్ద ఎన్పీసీఐ చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో దాదాపు 14 వందల మంది రైతుల ఎన్పీసీఐ వివరాలు పెండింగ్లో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. రైతులు సంబంధిత బ్యాంకుల వద్దకు వెళ్లి ఎన్పీసీఐ చేయించుకోవాలని తెలిపారు.