శెట్టిపాలెంలో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్

అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం శెట్టిపాలెంలో గిరిజన సహకార సంస్థ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ పనులకు సీఎం చంద్రబాబు పాడేరులో వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించే కర్మాగారానికి స్పీకర్ అయ్యన్న చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సర్పంచ్ అల్లు రామనాయుడు తెలిపారు.