వైసీపీ నాయకుడు అకస్మాత్తుగా మృతి

వైసీపీ నాయకుడు అకస్మాత్తుగా మృతి

NDL: అవుకు మండలం రామాపురం గ్రామంలో వైసీపీ సీనియర్ నాయకుడు నాగిరెడ్డి ఇవాళ అకస్మాత్తుగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి రామాపురం గ్రామానికి చేరుకున్నారు. వైసీపీ నాయకుడు నాగిరెడ్డి మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సందర్శించారు. మృతుని కుటుంబ సభ్యులకు కాటసాని రామిరెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.