తెలుగు రాష్ట్రాల మీదుగా మరో రెండు కొత్త రైళ్లు

తెలుగు రాష్ట్రాల మీదుగా మరో రెండు కొత్త రైళ్లు

రైల్వే ప్రయాణికులకు భారత రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల మీదుగా రెండు రైళ్లు ప్రయాణించనున్నట్లు ప్రకటించింది. విశాఖ-కొల్లాం ఎక్స్‌ప్రెస్ ప్రతి మంగళవారం ఉ.8:20కి విశాఖలో బయలుదేరి మరుసటి రోజు మ.2:50కు కొల్లాం చేరుకుంటుంది. చర్లపల్లి-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ చర్లపల్లి నుంచి మంగళవారం ఉ.7:15కు బయలుదేరి మరుసటి రోజు ఉ.11:20కి షాలిమార్‌కు చేరుకుంది.