విశాఖలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన
VSP: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు అయ్యన్న పాత్రుడు, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, సీపీ శంకబ్రత బాగ్చి స్వాగతం పలికారు. సాయంత్రం ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొని మంగళవారం తిరుగు ప్రయాణం కానున్నారు.