దుందుభి నదిలో చిక్కుకున్న పశువులు

MBNR: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాజాపూర్ మండలంలోని ఇదగానిపల్లి వద్ద దుందుభి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో గ్రామానికి చెందిన దారమోని మల్లేశ్ తన వ్యవసాయ పొలంలో కట్టివేసిన పశువులు నీటిలో చిక్కుకుపోయాయి. గురువారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ బృందం, రాజాపూర్ ఎస్సై శివానంద్ ఆధ్వర్యంలో పోలీసులు పశువులను సురక్షితంగా బయటకు తీశారు.