అసెంబ్లీలో ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఫైర్

అసెంబ్లీలో ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఫైర్

TG: అసెంబ్లీ జీరో అవర్‌లో ఆర్మూర్ MLA రాకేశ్‌రెడ్డి నిజామాబాద్(D)లో రోడ్ల దుస్థితిపై మండిపడ్డారు. రోడ్లపై మీటరు లోతు గుంతలు ఉండటంతో ప్రజలు నడవలేని స్థితిలో ఉన్నారని ఫైర్ అయ్యారు. ఆర్మూరులో SC, ST, BC, మైనార్టీ, మహిళా హాస్టల్స్‌ను మంజూరు చేయాలని కోరారు. అలాగే, ఎర్రజొన్నలకు రూ.500 బోనస్ ఇవ్వాలని, అవసరమైతే ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.