ఏపీ ఈసెట్ పరీక్షకు 7 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
ATP: ఏపీ ఈసెట్ పరీక్షను రేపు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మొత్తం 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎస్ఆర్ఐటీ, పీవీకేకే, గేట్స్, ఎస్వీఐటీ, తాడిపత్రి ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు అనంతపురంలోని అయాన్ టెక్ ఇన్ఫోసిస్ సొల్యూషన్స్లో ఈ పరీక్ష జరగనుందని అధికారులు తెలిపారు.