మేయర్గా మమత శ్రీను ముదిరాజ్
మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ నుంచి కాంగ్రెస్ కార్పొరేటర్గా గుమాల్ మమత శ్రీను ముదిరాజ్ విజయం సాధించారు. అనంతరం కార్పొరేషన్ తొలి మహిళా మేయర్గా ఎన్నిక కావడం విశేషం. మధ్య తరగతి కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆమె తక్కువ కాలంలోనే కార్పొరేటర్గా గెలిచి మేయర్ పీఠాన్ని అధిరోహించారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని ఆమె నిరూపించారు.