బీసీసీఐ కీలక నిర్ణయం
డిసెంబరు 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుండటంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత జాతీయ జట్టు ఆటగాళ్లందరూ ఈ టోర్నీలో కనీసం రెండు మ్యాచ్లు ఆడాలని ఆదేశించింది. స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పటికే విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉంటామని ఆయా జట్లకు సమాచారం ఇచ్చారు. కాగా, ఫిట్గా లేని ఆటగాడికి మినహాయింపు ఉంటుంది.