సీతా నగర్లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
SKLM: సంతబొమ్మాళి మండలం సీతానగరం గ్రామంలో ఇవాళ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న 58మంది రోగులకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ పరీక్షలు నిర్వహించారు. వెన్ను, మోకాళ్ళు నొప్పులు, డయాబెటిస్, శ్వాస సమస్యలు, చర్మ రోగాలు, ఇతర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారిని పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.