నేడు టీమిండియా, సౌతాఫ్రికా ఢీ
రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఇవాళ టీమిండియా, సౌతాఫ్రికా తలపడనున్నాయి. మ.1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. KL రాహుల్ కెప్టెన్సీలోని భారత జట్టు రెండో వన్డేను గెలిచి సిరీస్ను తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది.