'మోక్షజ్ఞ' ఎంట్రీకి రంగం సిద్ధం..!
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. బాలయ్య నటించిన 'ఆదిత్య 369'కు సీక్వెల్గా రాబోతున్న 'ఆదిత్య 999 మ్యాక్స్'లో మోక్షజ్ఞ నటించనున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ను పూర్తి చేశాడట. 2026 జనవరి చివరిలో ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్.