వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు..!
NZB: ధర్పల్లి మండలంలోని కర్నల్తండా వద్ద భగీరథ ట్యాంకు నిండి తాగు నీరు రోడ్డు పై పారుతుంది. మిషన్ భగీరథ అధికారుల పర్యవేక్షణ నిర్లక్ష్యం కారణంగా భగీరథ నీళ్లు వృథాగా పోతున్నాయని ప్రజలు తెలిపారు. గ్రామాల్లో తాగు నీరు అందక ప్రజలు అల్లాడి పోతూ ఇబ్బందులు పడుతున్నారు. నీరు వృథాగా పోకుండా అందించాలని స్థానికులు, ప్రజలు కోరుతున్నారు.