మిథున్ రెడ్డి పిటిషన్పై నేడు విచారణ
AP: పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఎంపీ మిథున్ రెడ్డి వేసిన పిటిషన్పై కోర్టు విచారణ కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో ఆయన నిందితుడిగా ఉన్న నేపథ్యంలో నిన్న ఇరువర్గాల వాదనలు విన్న విజయవాడ ఏసీబీ కోర్టు.. ఇవాళ ఉత్తర్వులు జారీ చేయనుంది. కాగా ప్రస్తుతం ఆయన బెయిల్పై బయట ఉన్నారు.