విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయ వివరాలు

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయ వివరాలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారిని మంగళవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. భక్తుల చేసిన వివిధ సేవల ద్వారా రూ.2.61 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 121 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 1820 మంది స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.