వెంకటాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభం
అన్నమయ్య: గాలివీడు మండలం పందికుంట గ్రామం వెంకటాపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. గ్రామస్థులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు.