'మహా సభలను విజయవంతం చేయాలి'
NGKL: తెలంగాణ డప్పు కళాకారుల సంఘం మొదటి రాష్ట్ర మహా సభలు జరగనున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు బేజిని మైబు తెలిపారు. ఇవాళ ఈ సభలకు సంబంధించిన గోడ పత్రికను తిమ్మాజీ పేట్లో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26న MBNRలోని అంబేద్కర్ కళా భవన్లో ఈ సభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని డప్పు కళాకారులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.