అండర్ పాస్ నీటి తొలగింపు పరిశీలించిన DSP

MDK: మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద అండర్పాస్లో నిలిచిన నీటిని తొలగింపు పనులను తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ పరిశీలించారు. 44వ జాతీయ రహదారిపై రామాయపల్లి వద్ద ఉన్న అండర్పాస్లో నీరు చేరడంతో హైదరాబాద్ వెళ్లే వాహనాలు ఇబ్బందులకు గురయ్యాయి. భారీ మోటర్లు ఏర్పాటు చేసి నీటిని తొలగించే పనులు చేపట్టారు. ఇందులో సీఐ రంగ కృష్ణ, ఎస్సై సుభాష్ గౌడ్ పాల్గొన్నారు.