ధర్మవరంలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఏర్పాటు
SS: ధర్మవరం పట్టణంలోని కళాశాల సర్కిల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన విగ్రహాన్ని కూటమి నేతలు భారీ క్రేన్ సహాయంతో సిమెంట్ దిమ్మెపై ఏర్పాటు చేశారు. గురువారం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, మంత్రి సత్యకుమార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.