పాము కాటుతో వ్యక్తి మృతి

VZM: రామభద్రపురం మండలం నాయుడు వలస గ్రామానికి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఎం సత్యనారాయణ (30) అనే వ్యక్తి మూడు రోజుల క్రితం పాము కాటు గురయ్యారు. విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆయన భార్య చాలా కాలం క్రితం మృతి చెందింది. ఈయనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.